నిర్మల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం శోచనీయమన్నారు. కవితపై కేసులు బనాయించాలని చూస్తు న్న బీజేపీ నాయకుల కుట్రలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని హెచ్చరించారు.
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి