ప్రతి ఒక్క మహిళ ఆచరించాలి
ఆరోగ్యకర సమాజం దిశగా సాగాలి
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
గజ్వేల్లో ‘రుతుప్రేమ’పై అవగాహన
గజ్వేల్, మే 28: మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో రుతుప్రేమ కార్యక్రమంపై మహిళా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రుతుస్రావం సమయంలో మహిళలు వినియోగించే శానిటరీ ప్యాడ్స్ డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు.
సిద్దిపేటలో రూ.300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తే, కేవలం శానిటరీ ప్యాడ్స్ను మరుగుదొడ్లలో వేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ పూర్తి ఇబ్బందికరంగా మారిందన్నారు. అందుకోసం మహిళలు శానిటరీ ప్యాడ్స్కు బదులుగా శానిటరీ మెంస్ట్రువల్ కప్పులను వినియోగించాలని కోరారు. జీవిత కాలంలో మెంస్ట్రువల్ కప్పులు నాలుగింటిని మాత్రమే వినియోగించవచ్చని, కానీ.. మహిళ తన జీవితకాలంలో రుతుస్రావ సమయంలో 7,220 శానిటరీ ప్యాడ్స్ వాడాల్సి ఉంటుందని తెలిపారు. ప్యాడ్స్ వినియోగం కన్నా మెంస్ట్రువల్ కప్పులను వినియోగిస్తే రూ.48 వేలు జీవితకాలంలో ఆదా చేయవచ్చని సూచించారు. సమాజాన్ని ప్రభావితం చేయడంలో ముందుండే మహిళా ప్రజాప్రతినిధులు ఈ కప్పులను ఉపయోగించి గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి మెంస్ట్రువల్ కప్ల ఉపయోగాల గురించి వివరించి అందరూ వినియోగించేలా చైతన్యపర్చాలని సూచించారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మంత్రి వైద్యులకు సూచించారు. ప్రతి సాధారణ ప్రసవానికి రూ.3 వేల చొప్పున ప్రభుత్వ దవాఖానకు నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కార్య క్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, సిద్దిపేట సీపీ శ్వేత, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.