మహబూబ్నగర్ : మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మినీ ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న నెక్లెస్ రోడ్డు, బ్రిడ్జి పనులు ఆగకుండా చేపట్టాలని ఆయన సూచించారు.
అంతకుముందు అల్మాస్ ఫంక్షన్ హాల్ సమీపంలో వరద పరిస్థితిలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మునిసిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అధికారులు ఉన్నారు.