Asaduddin Owaisi | హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐదు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తును ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఉర్దూ భాషలోనూ ఉండాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఉర్దూలో అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారిని కోరుతున్నామని తెలిపారు. అందరూ అవకాశాన్ని ఉపయోగించుకుని లబ్ది పొందాలని ఒవైసీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించాలన్నారు.