హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమై హైదరాబాద్కు మణిహారంలా మారిన ఈ ప్రాజెక్టు మంగళవారం ఐదేం డ్లు పూర్తి చేసుకోబోతున్నది. ప్రధాని మోదీ 2017 నవంబర్ 29న నాగోల్-అమీర్పేట-మియాపూర్ పరిధిలోని 30 కి.మీ. మార్గాల్లో మెట్రో సేవలను ప్రారంభించారు. నాటి నుంచి మెట్రో రైళ్లను 4 లక్షలకుపైగా ట్రిప్పులు తిప్పి 30 కోట్ల మందికిపైగా ప్రయాణికులను గమ్యాలకు చేర్చారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్థానం ఇదీ..