హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో ఎన్నికల కమిటీల ఏర్పాటు రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు ఆదివారం గాంధీభవన్పై దండెత్తారు. భారీ సంఖ్యలో చేరుకున్న పొన్నం వర్గీయులు గాంధీభవన్లో బైఠాయించారు. బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవచేస్తూ రాష్ట్రంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పొన్నం ప్రభాకర్ను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతకు న్యాయం చేయకుంటే పార్టీని వీడుతామని హెచ్చరించారు.
బానిసల్లా బీసీ నాయకులు: శ్రవణ్
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్కు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు బానిసల్లా బతుకుతున్నారనడానికి పొన్నం ప్రభాకర్ ఘటననే తాజా ఉదాహరణగా పేర్కొన్నారు. అస్తిత్వం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలే గాంధీభవన్ మెట్లెకి కొట్లాడాల్సిన అగత్యం రావడం అకడ కొనసాగుతున్న ఫ్యూడలిజంకు నిదర్శనమని తెలిపారు. ‘చీమలు పెట్టిన పుట్ట లో పాములు చేరినట్టు’గా రేవంత్రెడ్డి లాం టి ఫ్యూడల్ శక్తులు గాంధీభవన్ను, కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకొని పొన్నం ప్రభాకర్, మధుయాషీ, పొన్నాల లక్ష్మ య్య, ప్రేమ్లాల్, నాగయ్య, జగదీశ్ నేత, నూతి శ్రీకాంత్, కేతురి వెంకటేశ్, కైలాష్ నేత లాంటి బీసీ నాయకులను అవమానిస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్లో మున్ముందు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని శ్రవణ్ పేర్కొన్నారు.