హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఆరు కిలోల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది.
ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో మేం పాలుపంచుకోవడం మాకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి ముఖ్యమంత్రి ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్రకటించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ రామరాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్రకటించారు.
సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ – 6 కిలోలు
ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు – 2 కిలోలు
జలవిహార్ రామరాజు – 1 కిలో
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి – 5 కిలోలు
మంత్రి మల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి – 2 కిలోలు
మంత్రి హరీశ్రావు – 1 కిలో
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవకొండ దామోదర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్కర్ రావు – 1 కిలో
జీయర్ పీఠం – 1 కిలో
ఎమ్మెల్యే బాల్క సుమన్ – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హనుమంతరావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
కడప వ్యాపారవేత్త జయమ్మ – 1 కిలో