పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram project) కాపాడుకునేందుకు అన్నదాతలు ముందు కొస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్కి(Medigadda Barrage) తక్షణమే మరమ్మతు చేసి మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లలో నీరును నిల్వ ఉంచేలా చూడాలని ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం మేడిగడ్డ ప్రాజెక్ట్ను కాపాడాలని పెద్దపల్లి(Peddapalli) కలెక్టరేట్ కార్యాలయంలో రైతులు కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు.
తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.