గోల్నాక (హైదరాబాద్): సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు. శుక్రవారం అంబర్పేట పటేల్నగర్ కమ్యూనిటీ హాల్లో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. శిబిరంలో వసతులతో పాటు కంటి పరీక్షల నిర్వహణను అక్కడున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి వెలుగు(Kanti velugu), బస్తీ దవాఖానాలు, టీ డయాగ్నిస్టిక్స్ కేంద్రాలు, మెడికల్ కాలేజీలు( Medical College), కొత్త దవఖానాల ఏర్పాటుతో వైద్య సేవలు ప్రజల ముంగిటకు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసం సీఎం కేసీఆర్(CM KCR) ప్రతిష్టాత్మకంగా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
వంద రోజులు పాటు కొనసాగుతున్న ఈ శిబిరాల్లో ఇప్పటికే కంటి సమస్యతో బాధపడే అనేక మంది సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వీణ, ప్రవీణ్, ఆశావర్కర్లు బుగ్గమ్మ, సంతోషి, సిరిన్, మాలతి, అనిత, బీఆర్ఎస్ నాయకులు అమనూరి సతీశ్, మహేశ్ముదిరాజ్, అతిక్, నర్సింగ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.