Media Accreditation | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీతో అక్రిడేషన్ కార్డుల గడువు ముగియనుంది. తదితర కారణాల వల్ల ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఐ అండ్ పీఆర్ అధికారులు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు అక్రిడేషన్ల గడువును పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు అధికారులు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | యేసు ప్రభువు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం : హరీశ్రావు
Allu Arjun | చిక్కడపల్లి పీఎస్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ