హైదరాబాద్, ఫిబ్రవరి 8 : మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును జాతర ధర్మకర్తల మండలితోపాటు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు ఆహ్వానించారు. ఈ మేరకు ప్రగతిభవన్లో మంగళవారం సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 16 నుంచి జాతర ప్రారంభమవుతున్నదని, కుటుంసమేతంగా వచ్చి తల్లులను దర్శించుకోవాలని కోరారు. సీఎంను కలిసినవారిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సకు, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినాచొంగ్తు, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు ఉన్నారు.