హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఇరాన్ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న సైనిక దాడులను ఎంసీపీఐ (యు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్పై సైనిక దాడి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మీదనేకాక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు.