జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి..
వ్యాక్సిన్తో చాలా ప్రయోజనాలు
వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి..
ఆదిలాబాద్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా సాగుతున్నది. జిల్లా దవాఖానలు, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో వైద్యశాఖ అధికారులు టీకా వేస్తున్నారు. రోజు 10 వేల మందికి టీకా వేయాలని ప్రణాళికలు తయారు చేసి ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వల్ల కలిగే ప్ర యోజనాలకు ప్రజలకు వివరిస్తూ వారిని వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా టీకా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా 45 ఏండ్లు దాటిన వారందరూ టీకా వేసుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా చా లా మంది కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల గ్రా మస్తులు అందరూ కలిసికట్టుగా వేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల ఇంట్లోవారందరూ, స్నేహితులు, బంధువులు కూడా తీసుకుంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకా వేసుకున్న వారు ఇష్టానుసారంగా తిరుగకుం డా కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు సూ చిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. కొందరు తమకేమీ కాదులే అనే ధోరణి అవలంబిస్తున్నారు.
జనవరి 16 నుంచి..
తెలంగాణ సర్కారు టీకా కార్యక్రమాన్ని జనవరి 16 నుంచి ప్రారంభించింది. అన్ని జిల్లాల్లోని దవాఖానలకు వ్యాక్సిన్ ను కూడా సరఫరా చేసింది. నిల్వ కోసం ఫ్రిజ్లు, వేయడానికి సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచింది. మొదటగా ఫ్రంట్లైన్ వారియర్స్, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్యకర్తలకు వేశారు. తదానంతరం 65 ఏండ్లు, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వేశారు. వీరికి విజయవంతం కావడంతో ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు నిండిన వారికి వేస్తున్నారు. మన వద్ద రెండు కంపెనీల టీకాలు వేస్తున్నారు. ఏ టీకా వేసుకున్నా రియాక్షన్లు కనిపించడం సాధారణం అని, వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుందని, కొందరిలో జ్వరం, కండరాల నొప్పి, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు అవగాహన నిర్వహిస్తున్నారు. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు, మూడు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయని, లేకపోతే పారాసిటమాల్ వంటివి తీసుకుంటే సరిపోతుందని పేర్కొంటున్నారు. టీకాతో సైడ్ ఎఫె క్ట్స్ ఏమి ఉండవంటున్నారు. ఇప్పటివరకు ఆరోగ్య సమస్యలు రాలేదని, వైద్యులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
వ్యాక్సిన్తో ప్రయోజనం..
మొదటి డోస్ వేసుకున్న 28 రోజులకు రెండో డోస్ వేసుకోవాలని, రెండో డోస్ వేసుకున్న 14 రోజులకు శరీరంలో ప్ర తిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు వేసుకున్న సెంటర్లోనే రెండో డోసు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతున్నా రు. ఈ వ్యాక్సిన్తో మన శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. ఈ ప్రతిరక్షకాలు మన శరీరంలో నోటి, ముక్కు ద్వారా ప్రవేశించిన కరోనా వైరస్పై పోరాడుతాయని పే ర్కొంటున్నారు. అప్పుడు మనం కరోనా నుంచి సేఫ్గా ఉం డవచ్చని తెలుపుతున్నారు. అందుకోసమే టీకా తప్పకుండా అర్హులైన వారు తీసుకోవాలని పోలీసులు, వైద్యబృందాలు, కళాజాత బృందాలు కూడా అవగాహన కల్పిస్తున్నాయి.
మంచి ఆహారం తీసుకోవాలి..
టీకా తీసుకున్న అనంతరం బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. త్వరగా కోలుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచే నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యాధికారులు సూ చిస్తున్నారు. నీరు అధికంగా ఉండే సూప్స్ తీసుకోవడం మేలని చెబుతున్నారు. చికెన్, బోన్ సూప్స్, బీన్స్, కాయధాన్యాలు, ఆలుగడ్డలు, బ్రకోలి వంటివి తీసుకోవాలంటున్నారు. మాంసాహారులైతే చికెన్ సూప్ ఉత్తమం. క్యారెట్, ఉప్పు, మిరియాలు మొదలైనవి వ్యాక్సిన్ వేసుకున్నాక కలిగే మంటతో పోరాడడానికి సహాయపడుతాయని చెబుతున్నారు.
నిర్లక్ష్యం వద్దు..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరు మాకు ఏమి కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు. మాస్క్లు ధరించడం లేదు. శా నిటైజ్ చేసుకోకుండా, భౌతికదూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా ఉంటున్నారు. కానీ.. ఇదీ మంచిది కాదని, నిర్లక్ష్యంగా ఉంటే కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హె చ్చరిస్తున్నారు. టీకా వేసుకున్నా.. వేసుకోక ముందు తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదీ కరోనా సోకి తగ్గిన వారికి, సోకని వారికి కూడా వర్తిస్తుందని తెలుపుతున్నారు. గాలిద్వారా వ్యాప్తి చెందుతుందని నిపుణులు సూచిస్తున్న దృష్ట్యా ఆఫీసులు, ఇంట్లో, జనం రద్దీ ప్రదేశాల్లో తప్పకుండా భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజేషన్ చేయించుకోవాలని చెబుతున్నారు.