భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్గౌడ్ మంగళవారం విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన ప్రత్యేక కార్యాయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 3వ తేదీన జిల్లా గ్రంథాలయం నూతన భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కు హజరవ్వాలని కొరుతూ మంత్రి జగదీశ్రెడ్డికి ఆహ్వాన ప్రతిక అందజేసి ఆహ్వానించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్ గౌడ్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు నాగారం అంజయ్య పాల్గొన్నారు.