మంథని, నవంబర్ 4: మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు సోదరుడు శీనుబాబు కాంగ్రెస్లో చేరాలని డబ్బులు ఆశ చూపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఆమె భర్త రవి ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, సోదరుడు శీనుబాబుపై శనివారం మంథనిలోని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసులో ఫిర్యాదు చేశామని తెలిపారు. బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేస్తున్న తమను కాంగ్రెస్లో చేరాలని అక్టోబర్ 10 నుంచి ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్బాబు సోదరుడు శ్రీనుబాబు, కరీంనగర్కు చెందిన ప్రసాద్రెడ్డి 9000700045 నంబర్ నుంచి ఫోన్లు చేస్తూ డబ్బుల ఆశ చూపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెసోళ్లిచ్చే తాయిళాలకు అమ్ముడుబోమని వారు తేల్చిచెప్పారు.