Manda Jagannath | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. రేపు ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని మందా కలవనున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.