రంగారెడ్డి: జిల్లాలోని కడ్తాల్ మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ముచ్చర్ల గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని డీసీఎం డ్రైవర్ మొయినుద్దీన్గా గుర్తించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.