హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ అధికారులతో మల్లు రవి సోమవారం సమావేశమయ్యారు.
రాష్ర్టానికి సం బంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణభవన్ విభజన, ఆస్తుల పంపకానికి ఇరు రాష్ర్టాల అంగీకార పత్రాలను హోం శాఖ అధికారులకు ఇటీవలే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అందజేశాయని చెప్పారు.