జమ్మికుంట, మే 24 : హుజూరాబాద్లో ప్రణవ్బాబు కాంగ్రెస్కు ఇన్చార్జిగా కాకుండా ఒక గడీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ నియమించిన కమిటీలను ఎలా రద్దు చేస్తారని, అస లు ప్రణవ్కు సభ్యత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్బాబు వైఖరిని నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రణవ్ పార్టీ కోవర్టుగా పనిచేస్తున్నారని, ఆయన బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రణవ్పై సీఎం రేవంత్రెడ్డికి, మం త్రులు పొన్నం, శ్రీధర్బాబుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు సమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, సలీం, రామస్వామి తదితరులు ఉన్నారు.