చేర్యాల, ఫిబ్రవరి 11 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna Temple) వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ ఆదివారం సందర్భంగా రూ.55,18,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్ర(మహా శివరాత్రి),శని ఆదివారాలలో ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా వచ్చిందన్నారు.
మహా శివరాత్రి రోజున రూ. 16,54,043, శనివారం రూ.16,11,232, ఆదివారం రూ.22,52,751 వచ్చినట్లు తెలిపారు. మూడు రోజులకు మొత్తం ఆదాయం రూ.55,18,026 స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయవర్గాలు వెల్లడించాయి