కంటోన్మెంట్, ఏప్రిల్ 15: కంటోన్మెంట్కు సాయ న్న చేసిన సేవలకు గుర్తుగా ఆయన కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదితకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం బోయిన్పల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 30 ఏండ్లు ప్రజాజీవితంలో ఉన్నా సాయన్న కుటుంబానికి సొంత ఇల్లు లేదని గుర్తుచేశారు. ప్రజలతో మంచి అనుబంధం ఉన్న సాయన్న కుమార్తె నివేదితను అందరూ ఆశీర్వదించాలని కోరారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు. సాయన్న కుటుంబంపై నమ్మకంతో తనను అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితకు కంటోన్మెం ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధన్యవాదాలు తెలిపారు. తన జీవితం కంటోన్మెంట్కే అం కితమని, ప్రజలు తనను దీవించాలని నివేదిత విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, పాండు యాదవ్, లోకనాథ్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, సీనియర్ నేతలు ఆకుల హరి తదితరులు పాల్గొన్నారు.