సందీప్కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కరికాల’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారం టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సందీప్కిషన్ ఖడ్గాన్ని చేతబూని గుర్రంపై స్వారీ చేస్తూ.. సింహాన్ని వేటాడుతూ ఓ యోధుడి అవతారంలో కనిపిస్తున్నారు. సోషియో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అర్థమవుతున్నది.
ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని, తొలి భాగాన్ని వచ్చే ఏడాది జూలై 2న, రెండో భాగాన్ని అక్టోబర్ 28న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన కథ, కథనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.