హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఎస్సీ కులాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మాలసంఘాల రా ష్ట్ర జేఏసీ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ను శుక్రవారం కలిశారు. మా లలు ఎదురొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రితోపాటు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వినతిపత్రాలు అందజేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఎస్సీ కులాలకు మేలు జరుగుతున్నదని మంత్రి కొప్పుల చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ మాల అనుబంధ కులాల సమాఖ్య మాజీ కోఆర్డినేటర్ రావుల అంజయ్య, మాల మహానాడు (పీవీ రావు) వ్యవస్థపాక అధ్యక్షుడు చెరుకు రాంచందర్, వరింగ్ చైర్మన్ తాళ్లపల్లి రవి, తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి రావుల విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.