చిట్యాల, మే 2: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 14 ఎకరాల్లో మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలపూర్ శివారులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలపూర్ శివారులో శనివారం గోపగాని చిన్న వెంకన్నకు చెందిన నాలుగు ఎకరాలు, 75 పైపులు, గోపగాని రవీందర్కు చెందిన నాలుగు ఎకరాలు, 45 పైపులు, ఆరెల్లి కృష్ణమూర్తికి చెందిన నాలుగు ఎకరాలు, 30 పైపులు, రెండు పరదాలు, 100 సంచులు, మెరుగు ప్రభాకర్కు చెందిన రెండు ఎకరాలో మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఆరుగాలం కష్టపడి పంచిన పంట చేతికందే దశలో అగ్గిపాలవడంతో బోరున విలపించారు. పంట నష్టాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.