హైదరాబాద్ : కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతులను( Farmers) నిండా ముంచింది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతుబంధుకు కేటాయించిన రూ.7 వేల కోట్లు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డైవర్ట్ చేశారు. ఆ డబ్బు ఏమైంది? ఎక్కడికి వెళ్లిందో సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో రేవంత్ రెడ్డి ఎకరాకు 20 వేలు ఇవ్వాలని అడిగారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రుణాలపై బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ అలాగే అధికారంలోకి రావాలని కలలు కంటున్నదని తెలిపారు. అబద్ధాలతో ఎక్కువ రోజులు పాలన సాగించలేరని స్పష్టం చేశారు.