2,425 మందితో రక్తదానం
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
బంజారాహిల్స్, జూలై 25: మంత్రి కే తా రకరామారావు జన్మదినం సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూ సుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 2,425 మం ది టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సినీ కార్మికులు రక్తదానం చేశారు. తలసీమియా సికిల్సెల్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది రక్తాన్ని సేకరించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ఎమ్మెల్యే మాగంటి నెల రోజులుగా రక్తదానం అంటే ప్రాణదానం చే యటం అని, తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మనవంతు సాయం చేద్దామని అవగాహన కల్పించారు. దీంతో రక్తదాతలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒకే రోజు, ఒకేచోట 2,425 మంది రక్తదానం చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రి కార్డ్స్ సౌత్ ఇండియా ప్రతినిధి వసుధ అశోక్.. రికార్డును నమోదు చేసుకుని ధ్రువీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే మాగంటికి అందజేశారు. కార్యక్రమంలో తలసీమియా సికిల్ సెల్ సొసైటీ జాయిం ట్ సెక్రటరీ అలీమ్ బేగ్, కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్యరావు పాల్గొన్నారు.