(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘బేటీ బచావో..’ అంటూ నినాదాన్నిచ్చిన ప్రధాని మోదీ హయాంలో ఆడబిడ్డలు అదృశ్యమవుతున్న కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన మూడేండ్లలో దేశవ్యాప్తంగా 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండా పోగా.. ఇందులో 1,98,414 మందితో బీజేపీపాలిత మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2019-2021కు సంబంధించిన ఎన్సీఆర్బీ నివేదికను కేంద్రం పార్లమెంట్కు సమర్పించింది.
మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్-5 రాష్ర్టాలు (2019-21)
రాష్ట్రం కేసులు
మధ్యప్రదేశ్ 1,98,414
పశ్చిమబెంగాల్ 1,93,511
మహారాష్ట్ర 1,91,433
ఒడిశా 86,871
ఛత్తీస్గఢ్ 59,933