Telangana | లక్షెట్టిపేట : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలో లక్షెట్టిపేట యువతి సత్తా చాటింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డుకు చెందిన నల్ల కావ్యశ్రీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డుకు చెందిన నల్ల చంద్రయ్య, సునీత దంపతుల పెద్ద కుమార్తె కావ్యశ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో ఈఈఈ విభాగంలో పూర్తి చేసింది. ఇంజనీరింగ్ తర్వాత పోటీ పరీక్షల కోసం మూడేండ్లు కష్టపడి చదివింది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పరీక్షను రాసింది. గురువారం వెలువడిన ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. కావ్యశ్రీ తండ్రి చంద్రయ్య కోటపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. తన తండ్రి 2003లో నిర్వహించిన డీఎస్సీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడని.. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని చదవడం వల్లే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించానని తెలిపింది.