సిద్దిపేట : ములుగు మండలం బైలంపూర్ అడవిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరేసుకున్నారు. ఇవాళ ఉదయం స్థానికులు ప్రేమికుల మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను స్వప్న(19), మహేశ్(29)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.