హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): లోక్సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమీక్షలు బుధవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సమావేశాలు 12వ తేదీ వరకు కొనసాగాయి. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో మూడు రోజులపాటు సమావేశాలకు విరామం ఇవ్వగా, నాగర్కర్నూల్ నియోజకవర్గవర్గ సమీక్షతో తిరిగి ప్రారంభించనున్నారు.
ఈ నెల 22న నల్లగొండ నియోజకవర్గ సమీక్షతో సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులపై సమీక్ష, రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పది లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం నుంచి 500-600 మందిని ఆహ్వానిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల సమావేశాలు ముగిసిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాటి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.