హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గుజరాత్ రాష్ట్రం ఈ ఏడాది కూడా లాకప్డెత్లలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా, తెలంగాణలో 2022లో ఒక్కటంటే ఒక్క లాకప్డెత్ కాలేదని స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. గుజరాత్లో క్రైమ్ రేట్ కూడా పెరిగింది. పోలీస్శాఖ పనితీరు, సిబ్బంది విధానం, పోలీస్ స్టేషన్లలో కల్పిస్తున్న మౌలిక వసతులపై ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్టు-2023 ఇచ్చిన నివేదికలో గుజరాత్కు 6వస్థానం లభించింది. ఇక 14 లాకప్ డెత్లతో గుజరాత్ ఈసారి కూడా దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. జాతీయ మానవ హకుల కమిషన్ నివేదిక ప్రకారం.. గత ఐదేండ్లలో గుజరాత్లో 94 మంది పోలీస్ కస్టడీలో మరణించారు. ఎంహెచ్ఏ రిపోర్టు ప్రకారం ప్రతినెలా 45 మంది మహిళలు గుజరాత్లో రేప్కు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక పోలీస్ కస్టడీ నుంచి నేరస్తులు తప్పించుకున్న కేసుల్లో మహారాష్ట్ర (104), మధ్యప్రదేశ్ (94), పంజాబ్ (76), రాజస్థాన్ (73)) ముందు వరుసలో ఉన్నాయి.
లాకప్ డెత్లు రాష్ర్టాలవారీగా..