నీలగిరి, డిసెంబర్ 10: నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది. ఇందులో అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై సతీశ్రెడ్డి ఆదివారం సాయంత్రం సూర్యనాయక్తోపాటు అతని సోదరుడిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారణ జరిపారు. ఈ క్రమంలో సూర్యనాయక్ హైబీపీతో స్టేషన్లోనే కిందపడిపోయాడు. వెంటనే అతడిని బంధువులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కొట్టడం వల్లే సూర్యనాయక్ చనిపోయాడని ఆరోపిస్తూ అతడి బంధువులు దవాఖాన వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఎస్సై సతీశ్రెడ్డిని ముందుగా నల్లగొండ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసినట్టు ఎస్పీ పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు. సూర్యనాయక్ను విచారిస్తుండగా బీపీతో పడిపోయాడని ఎస్సై సతీశ్రెడ్డి తెలిపారు.