గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులంతా ఉదయం 10గంటల లోపు నిత్యావసర సరుకులు తీసుకోవాలని వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి అన్నారు.
ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుందని అన్నారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సర్పంచ్ పిట్టల హేమలత కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దయాకర్రెడ్డి, ఏఎస్ఐ భిక్షం, అంగన్వాడీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.