హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. నైరుతి తిరోగమనం చివరి దశకు చేరుకోవటంతో పది రోజులుగా వర్షాలు పడటం లేదని చెప్పింది.
రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్యం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. భారీ వర్షాలకు అవకాశం లేకపోయినా జల్లులు కురుస్తాయని చెప్పింది. ఈసారి తెలంగాణలోని 18 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. నైరుతి సోమవారంతో రాష్ర్టాన్ని వీడిపోతున్నట్టు చెప్పింది.