జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్లో 24 గేట్లను ఎత్తివేసినట్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మంగళవారం తెలిపారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత వరద నీరు గోదావరి నదిలో కలుస్తుండడంతో బరాజ్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం బరాజ్లో 12.230 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 63,740 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 44,730 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి