హైదరాబాద్ : ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జనగామ జిల్లాలో జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో, దేవరుప్పుల మండల సమావేశం అదే మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ లో శుక్రవారం జరిగాయి.
ఈ సమావేశాల్లో పార్టీ పరిశీలకులు, వివిధ విభాగాల ఇంచార్జీలు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ dccb చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మెట్టు శ్రీనివాస్, భరత్ కుమార్ రెడ్డి, జన్ను జకార్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..జనగామ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ లో సీఎం మాట్లాడతారని, తెలంగాణలో అమలు అవుతున్న, అభివృద్ధి, సంక్షేమాలను సీఎం ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ..ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు.
దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. సభను విజయవంతం చేయాలని కోరారు.