మహబూబ్ నగర్ : అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మహబూబ్నగర్ను చేసునకుందామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులోని గుమస్తాలు, హమాలీలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని మంత్రి భరోసానిచ్చారు. మంచి చేసే వారి వెంబడి ఉంటే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్లు పాలించి కనీసం తగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో సాగు, తాగు నీరుకు డోకాలేదన్నారు. కొన్ని పార్టీలు కుల, మత పిచ్చిలో జనం ఉండాలని కోరుకుంటున్నారు.
అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ చేరుతున్నామని హమీలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, ముడ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్ తదితరులు ఉన్నారు.