హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారా తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్, అంబేద్కర్ ఆశయాలతో పాలన కొనసాగించారని తెలిపారు.