నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతిచెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. దీంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిరుతను దవాఖానకు తరలించారు. ఈఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.