సంస్థాన్ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. సంస్థాన్ నారాయణపురం ఎంపీటీసీ వన్ స్థానంలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన 90 మంది బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గంగుల , ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకు ముందు సంస్తాన్ నారాయణపురంలో ఉప ఎన్నికల ప్రచారం, మండల కేంద్రంలోని పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు, పోలింగ్ బూతుల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ సందర్భంగా జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా వాటి పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని శ్రేణులకు సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖరారు అయిందని, మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు.