భూత్పూర్, ఫిబ్రవరి 8 : హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4, 9, 10వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, కేసీఆర్ నామజపంతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూత్పూర్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ చెప్పే మాయమాటలకు లొంగకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.