నర్సంపేట రూరల్, మార్చి 14: ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49)కి ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, స్నేహితులు, కళాకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో సోమవారం ఆయన దహన సంస్కారాలు నిర్వహించారు. నాగుర్లపల్లికి చెందిన కందికొండ రెండేండ్లుగా గొంతు క్యాన్సర్తో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు. అంతకుముందు కందికొండ కుటుంబాన్ని పలువురు నేతలు, సినీ ప్రముఖులు పరామర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్ కందికొండ పార్థివదేహానికి నివాళులర్పించి పాడె మోశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్లు బోలే శావలి, లక్ష్మణ్, శ్రీను, లలిత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.