హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని ఆర్టీసీ కార్మిక నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలు పరిషరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సమ్మె నోటీసులపై ఆర్టీసీ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత జఠిలమైందని నేతలు వాపోయారు. ఈ మేరకు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నరేందర్రెడ్డి హామీ ఇచ్చినట్టు ఐఎన్టీయూసీ నేతలు తెలిపారు.
ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్కను కలిసి, చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సమాఖ్య నేతలు కే రాజిరెడ్డి నాయకత్వంలో వేం నరేందర్రెడ్డిని కలిసి, కార్మికుల సమస్యలు విన్నవించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్గౌడ్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు ఆర్డీ చంద్రశేఖర్, రాజిరెడ్డి, నాగన్న, జకుల మల్లేశంగౌడ్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.