హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడాది పాటు నడవనీయాలని, ఆ తర్వాత హామీల అమలుపై ప్రశ్నిద్దామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన గురువారం శాసనసభలో మాట్లాడుతూ… సంవత్సరం వరకు సమయం ఇచ్చి.. అప్పుడు ఫెయిలైతే అందరం కలిసి ప్రశ్నిద్దామని చెప్పారు.
ఏడాది తర్వాత తాము మీతో (బీఆర్ఎస్తో) కలువవచ్చునేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.