Minister KTR | ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారతదేశం’ అనే పుస్తకాన్ని ఒకరు తనకు ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు. ఈ రోజు ఒకరు ఈ గిఫ్ట్ ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ బుక్ కవర్ పేజీ ఫొటోను ట్వీట్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ ఆసక్తిగా మారింది.
Someone gifted👇today pic.twitter.com/fXcUlrRAFS
— KTR (@KTRBRS) March 21, 2023
గుజరాత్ రాష్ట్రంలోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉంటుందా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సికి స్కాట్ ఫ్రీగా ఎన్వోసీ ఇవ్వడంపై కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో స్పందించారు. చోక్సీ రాజా సత్యహరిశ్చంద బంధువు అయినట్లుగా కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడిన ఆయనను స్కాట్ ఫ్రీగా ప్రయాణించడానికి ఎన్వోసీ ఇవ్వడాన్ని కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. రూ.13వేలకోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీపై ఉన్న రెడ్కార్నర్ నోటీసులను ఇంటర్పోల్ డేటాబేస్ నుంచి తొలగించింది.