మహబూబాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో గ్రామస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.