కామారెడ్డి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు. కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కోనాపూర్ ప్రాథమిక పాఠశాలను కూడా ఆధునిక అంగులతో నిర్మిస్తామన్నారు. అలాగే జూనియర్ కళశాలకి అనుమతిని ఇస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా బీబీపేట్లో కోట్ల రూపాయలతో ఇంత చక్కటి పాఠశాలని నిర్మించిన దాత సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులకి అభినందనలు తెలిపారు.
పుట్టిన ఊరికి. చదువుకున్న పాఠశాలకి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ప్రశంసనీయమన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు, ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. వీటిని బాగు చెసుకుంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. నవంబర్ 29న వరంగల్లో తలపెట్టిన సభకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
భార్యను మోసం చేసిన కేసులో భర్త అరెస్ట్..విచారణలో విస్తుగొలిపే విషయాలు
Leopard attack | చిరుత దాడిలో ఆవు మృతి