KTR | చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్వాగతించారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం పట్ల భారతీయుడిగా గర్వపడుతున్నానన్నారు. మహిళా బిల్లు కోసం తాము సైతం ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు. మహిళా బిల్లు సాకారానికి మావంతు కృషి చేయడం గర్వంగా ఉందన్నారు.
మేం రాజకీయాలకు అతీతంగా లేవనెత్తిన కొన్ని అంశాలున్నాయని, మైలురాయి చట్టానికి మద్దతిచ్చే అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశంపై అందరూ కలిసి రావాలన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. చాలా ఏళ్ల కిత్రమే జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు తదితర స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
There are certain occasions when we have rise above politics, stand together on issues that matter in the larger interest of the Country
Today I am proud as an Indian citizen that our Parliament has taken into consideration the passage of #WomenReservationBill 👏
My…
— KTR (@KTRBRS) September 19, 2023