తిరువనంతపురం: రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్కింగ్ స్థలంలో ఉన్న 200కు పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగలు చూసి రైల్వే అధికారులు, ప్రయాణికులు, సమీపంలోని నివాసితులు భయాందోళన చెందారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. (Massive Fire At Railway Station) కేరళలోని త్రిస్సూర్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ప్లాట్ఫామ్ నంబర్ 2 సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ ఉండటంతో మంటలు మరింతగా ఎగసిపడ్డాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రైలు ప్రయాణికులు, అధికారులు, సమీపంలోని నివాసితులు ఈ మంటలు చూసి భయాందోళన చెందారు.
కాగా, అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అర గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న సుమారు 200కు పైగా ద్విచక్ర వాహనాలు కాలిపోయినట్లు గుర్తించారు.
మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన వల్ల రైలు సేవలు ప్రభావితం కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Thrissur, Kerala: A massive fire broke out at Thrissur Railway Station. The blaze originated in the bike parking area near the station’s rear entrance, destroying several motorcycles. Preliminary reports indicate that more than 600 bikes were parked in the affected area pic.twitter.com/XQoSURUtUB
— IANS (@ians_india) January 4, 2026
Also Read:
Priyanka Gandhi | ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు.. అస్సాం ఎన్నికల ప్యానెల్కు నేతృత్వం
Woman Kills Daughter-In-Law | కొడుకు గ్రాట్యుటీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్