హైదరాబాద్ : ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును ( Private Bill Notice) స్పీకర్ గడ్డం ప్రసాద్( Speaker Gaddam Prasad ) కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , పార్టీ ఎమ్మెల్యేలు అందజేశారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.
అత్యంత కీలకమైన ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేశారు.
కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీష్రెడ్డి, మల్లారెడ్డి, కేపీ వివేకానందా, సుధీర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, అనిల్ జాదవ్, మానిక్రావు, దాసోజ్ శ్రవణ్కుమార్ , శంభీపూర్ రాజు, మాదవరం కృష్ణారావు, కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి తదితరులున్నారు.